Breaking: టీడీపీకి భారీ షాక్.... కీలక నేతలంతా మూకుమ్మడి రాజీనామా

by Disha Web Desk 16 |
Breaking: టీడీపీకి భారీ షాక్.... కీలక నేతలంతా మూకుమ్మడి రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్‌ను ప్రకటించడంతో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు మూకుమ్మడి రాజీనామా చేశారు. పార్టీ మండల కన్వీనర్లు, బూత్ ఇంచార్జులు రాజీనామా చేశారు. అయితే తిప్పేస్వామి కూడా టీడీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. సునీల్ కుమార్‌కు బీఫామ్ ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని, ఆలోపు ఏదైనా జరగొచ్చని తిప్పేస్వామి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన వర్గంలోని నేతలు రాజీనామా ప్రకటించారు.

కాగా మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మధ్య కొంతకాలంగా వర్గ పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరన్న కుమాడు సునీల్ కుమార్‌కు ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థిగా అవకాశం లభించింది. దీంతో విభేదాలు పక్కన పెట్టి తిప్పేస్వామి మద్దతు కోసం ఈరన్న ప్రయత్నాలు చేశారు. అయితే సునీల్ కుమార్‌కు సీటు ఇవ్వడాన్ని తిప్పేస్వామి వర్గం మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

Next Story

Most Viewed